![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లోకి రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కేటగిరిలో ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన పేరు ప్రతిష్టలు ఇంకా పెరిగి పోయాయి. ఇప్పుడు ఆదిరెడ్డి తన ఉదారతను చాటుకున్నాడు. మనకు ఒక పది రూపాయలు వస్తే అందులో ఎంతో కొంత వేరేవాళ్లకు సాయం చేయాలని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనం ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండిపోతే వాటికి చెదలు పడతాయి తప్ప వాటికి విలువ పెరగదు అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి.
మరి ఆ మాటలను నిజం చేస్తూ ఆదిరెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ నెల 22 న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర సంస్థ వారు దేశవ్యాప్తంగా విరాళాలని ఆహ్వానిస్తున్నారు.. చాలా మంది కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ డబ్బులు కూడా పంపిస్తున్నారు.
.webp)
ఇక ఆ శ్రీరాముడి ఆశీస్సులు తన మీద తన కుటుంబం మీద అలాగే లోటస్ ల్యాండ్ మార్క్ లో పెట్టిన తన జావేద్ హబీబ్ సెలూన్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ఫామిలీ తరపున ఒక లక్ష రూపాయలను ఆ స్వామి వారికి విరాళంగా ఇచ్చాడు ఆదిరెడ్డి. ఇక ఆదిరెడ్డి చేసిన ఈ పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఆదిరెడ్డికి దైవ భక్తితో ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు కూడా సాయం చేసే గుణం కూడా ఎక్కువే అంటున్నారు. రీసెంట్ గా రోడ్ సైడ్ చలిలో పడుకున్న వారి కోసం దుప్పట్లు, భోజనం వగైరా వంటివి పంపిణీ చేసాడు. ఆ పిక్స్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆదిరెడ్డి.
![]() |
![]() |